Dense Fog | ఉత్తరాదిన (North India) చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది (Dense Fog). విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపోయింది. రోడ్డుపై వాహనాలు కనిపించని పరిస్థితి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గురువారం ఉదయం పాలెం విమానాశ్రయంలో విజిబిలిటీ 25 మీటర్లుగా ఉంది. దీంతో దాదాపు 134 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి రాకపోకలు సాగించే విమానాల్లో కొన్నింటిని దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు రైళ్ల రాకపోకలపై కూడా పొగ మంచు తీవ్ర ప్రభావం చూపించింది. సుమారు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
గురువారం ఉదయం 5:30 గంటలకు ఢిల్లీలోని సఫ్ధార్జంగ్ అబ్జర్వేటరీలో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, యూపీలో దృశ్యమానత 50 మీటర్ల నుంచి 25 మీటర్ల వరకూ ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యాణా, పంజాబ్, చండీగఢ్లలో 31వ తేదీ వరకూ పొగమంచు అతితీవ్రంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ ( India Meteorological Department ) వెల్లడించింది.
Also Read..
Vijayakanth | కెప్టెన్కు నివాళులర్పించిన సీఎం స్టాలిన్.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
Sharad Pawar | రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు : శరద్ పవార్
Vijayakanth | 27 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ.. అవార్డుల రారాజుగా నిలిచిన విజయకాంత్