పాట్నా: బస్సు, లారీ, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (Road Accident) బీహార్లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కోధా బ్లాక్లోని జాతీయ రహదారి 31పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బస్సు, లారీ, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Also Read:
Nitish Kumar | ముఖ్యమంత్రి నివాసం నుంచి.. నితీశ్ కుమార్ వస్తువులు తరలింపు