ముంబై: తమ సంబంధానికి అడ్డుగా భావించిన తల్లి తన కుమారుడి హత్య కోసం ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. వారిద్దరూ కలిసి బాలుడి తలను నీటి బకెట్లో ముంచి చంపారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అయితే అసలుగుట్టు రట్టయ్యింది. (Woman Killed Son Over Affair) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖేడ్ ప్రాంతంలో నివసిస్తున్న 27 ఏళ్ల బసిరన్ మెహబూబ్ షేక్ పదేళ్ల కిందట భర్త మెహబూబ్ నుంచి విడిపోయింది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు తండ్రితో కలిసి ఉంటుండగా, ఆరేళ్ల కుమారుడు అవేజ్ మాత్రం తల్లి సంరక్షణలో ఉన్నాడు.
కాగా, భర్త స్నేహితుడైన రామ్ వినాయక్ కాజేవాడ్, బసిరన్ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే ఆరేళ్ల కుమారుడైన అవేజ్ తమ సంబంధానికి అడ్డుగా ఉండటంతో ఆ బాలుడ్ని హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఏప్రిల్ 4న రాత్రి 11:30 గంటల సమయంలో అవేజ్ తలను బకెట్లోని నీటిలో ముంచి చంపారు. ఆ బాలుడు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి అతడి శరీరాన్ని నేలకేసి బాదారు.
మరోవైపు కుమారుడి హత్య తర్వాత అవేజ్ మృతదేహాన్ని బీడ్లో ఉన్న తన పుట్టింటికి బసిరన్ తరలించింది. తన కొడుకు గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది.
అయితే బాలుడి అంత్యక్రియల కోసం తండ్రి తరుఫు తాత ఆ ఇంటికి వెళ్లాడు. అవేజ్ మృతదేహంపై గాయాల గుర్తులను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలుడి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా హత్యగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలుడి తల్లి బసిరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు రామ్ వినాయక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Also Read:
Girl Consumes Poison After Rape | బంధువు అత్యాచారం.. విషం తాగి బాలిక మృతి
Hostel Boy Murder | హాస్టల్లో బాలుడిపై అసహజ లైంగిక దాడి, హత్య.. గార్డ్ అరెస్ట్
Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?