Lok Sabha | 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన 17వ లోక్సభ (Lok Sabha) పదవీ కాలం జూన్ 16, 2024తో ముగియనుంది. ఆ తర్వాత 18వ లోక్సభ కొలువుదీరనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను కూడా రిలీజ్ చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించననుంది. దీంతో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి.
ఇక 17వ లోక్సభ 2019 – 24 వరకూ ఐదేళ్ల పదవీకాలంలో కొనసాగిన విషయం తెలిసిందే. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ ఐదేళ్లలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 17వ లోక్సభకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా వెల్లడించింది. ఈ ఐదేళ్ల పదవీకాలంలో దిగువ సభ మొత్తం 15 సమావేశాలను నిర్వహించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (Association of Democratic Reforms) తెలిపింది. ఏడాదికి 55 రోజులు ఈ సమావేశాలు జరిగినట్లు పేర్కొంది.
ఈ ఐదేళ్లలో మొత్తం 505 మంది ఎంపీలు సుమారుగా 92,271 ప్రశ్నలు సంధించారు. ఒక్కో సభ్యుడు సగటున 315 ప్రశ్నలు సంధించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఇక ఈ ఐదేళ్లలో లోక్సభలో అధిక ప్రశ్నలు (Most Questions) వేసిన ఎంపీల్లో బీజేపీ నేతలో అగ్రస్థానంలో ఉన్నారు.
Also Read..
Arvind Kejriwal | ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ ఆందోళన..!
Gaza | గాజాలో దయనీయం.. ఆహారం చేజిక్కించుకునేందుకు వెళ్లి 18 మంది మృతి