Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రస్తుతం ఈడీ (Enforcement Directorate) కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈడీ కస్టడీలో (Probe Agency Custody) ఆప్ సుప్రిమో ఆరోగ్యం క్షీణించిందని (Health Deteriorated) ఆ పార్టీ బుధవారం తెలిపింది.
మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీ రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు పేర్కొంది. ఆయన బ్లడ్ షుగర్ లెవల్స్ ఒకానొక సమయంలో 46 ఎంజీకి పడిపోయినట్లు తెలిపింది. షుగర్ లెవల్స్ ఈ స్థాయికి పడిపోవడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెప్పినట్లు ఆప్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ మేరకు తమ సుప్రిమో ఆరోగ్యం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి.
మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈనెల 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఏడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కస్టడీకి అప్పగించింది. విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈనెల 28వరకూ మాత్రమే కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు విధించిన కేజ్రీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరే అవకాశం ఉందని సదరు వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Gaza | గాజాలో దయనీయం.. ఆహారం చేజిక్కించుకునేందుకు వెళ్లి 18 మంది మృతి
CJI | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్
Arvind Kejriwal | కేజ్రీవాల్ను కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ..!