Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (liquor policy case) ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీ (custody)కి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేజ్రీ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. రేపటితో ఆయన ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో ఆ వెంటనే కేజ్రీవాల్ను తమ కస్టడీకి కోరే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈనెల 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఏడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కస్టడీకి అప్పగించింది. విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈనెల 28వరకూ మాత్రమే కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు విధించిన కేజ్రీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరే అవకాశం ఉందని సదరు వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Saudi Arabia | మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి
AAP | దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్ : ఢిల్లీ మంత్రి అతిశీ