JK Elections | జమ్ముకశ్మీర్లో (Jammu And Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల వ్యవధిలోనే 10 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకూ 10.22 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు.
కాగా, రెండో విడతలో భాగంగా పీర్పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రెండో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
10.22% voter turnout recorded till 9 am in the second phase of J&K Assembly elections. pic.twitter.com/TfdT3b5Avu
— ANI (@ANI) September 25, 2024
Also Read..
JK elections | ఓటేసిన 102 సంవత్సరాల వృద్ధుడు.. ఆయన ఏమన్నాడంటే.. Video
CP Joshi | రాహుల్గాంధీ పాస్పోర్టును రద్దు చేయండి.. లోక్సభ స్పీకర్కు బీజేపీ ఎంపీ లేఖ
Gujarat | గుజరాత్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి