అమరావతి : విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల ( Fishermens Missing ) జాడ తెలియకముందే ఏపీలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ( Konaseema ) జిల్లాలో అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. వీరు ప్రయాణించిన గంట తరువాత నుంచి స్థానికులకు అందుబాటులోకి రాలేదు.
వేట ముగించుకుని పది రోజుల్లో రావాల్సిన వారు, ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన ఏసుదాస్, కోపనాతి రామకృష్ణ, కాటాడి సతీష్, పాలెపు శాంతారావు, కర్రిరాముడు, సంఘాని తాతారావు, కొల్లాటి శ్రీనివాస్ అనే మత్స్యకారుల కోసం అధికారులు గాలింపును ప్రారంభించారు.