JK elections : జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు యువత, వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దాంతో ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా చేంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి.
రియాసిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 102 ఏళ్ల వృద్ధుడు హగీ కరీమ్ దిన్ భట్ (Hagi Karam Din Bhat) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అభివృద్ధి పనులు బాగా జరుగుతాయని అన్నారు. పిల్లలకు మంచి విద్య లభిస్తుందని చెప్పారు. వ్యాపారాలు మెరుగుపడుతాయన్నారు.
#WATCH | J&K: Hagi Karam Din Bhat, who says he is 102 years old, casts his vote for the second phase of Assembly elections at a polling centre in Reasi.
He says, “If a good government is formed a lot of work will be done…The youth should get a good education, businesses… pic.twitter.com/pWfZ1aRxGN
— ANI (@ANI) September 25, 2024
కాగా జమ్ముకశ్మీర్లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 26 స్థానాలకు నిర్వహిస్తున్నారు. ఇక మిగిలిన 40 స్థానాలకు అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.