నారాయణపేట టౌన్, జనవరి 23 : మిషన్ భగీరథ ప థకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటి అందిస్తున్నామని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పట్టణంలో కొ నసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. ఎర్రగుట్ట వద్ద, కుమ్మరివాడ, టీవీ టవర్ వద్ద, ఆర్టీసీ కాలనీ, సింగారం చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న మి షన్ భగీరథ వాటర్ ట్యాంకులను ఆయన తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి సత్వరమే వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్త బస్టాండ్ ఎదురుగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ఆయన పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకొ ని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, కౌన్సిలర్ శిరీష, టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సు భాష్, సీనియర్ నాయకులు చంద్రకాంత్, శేఖర్, ప్రతాప్రెడ్డి, నాగరాజు, మున్సిపల్, మిషన్ భగీరథ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం పే దలకు అండగా ఉంటుందని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ కారణాల తో సీఎం సహాయనిధి నుంచి మం జూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పట్టణానికి చెందిన సుతారి స త్యమ్మకు రూ.1,50,000 చెక్కును, సుజాన్కుమార్కు రూ.60,000, సా విత్రమ్మకు రూ.1,25,000, వాసిం ఉ న్నిసాకు రూ.70,000, వెంకట్రాములుకు రూ. 1,00,000, అన్పూర్ సునీతకు రూ.36,000, మనోహర్కు రూ. 60,000, తులసీదాస్కు రూ.60,00 0, మన్నె సత్యమ్మకు రూ.60,000ల చెక్కును అందజేశారు. మండలంలోని జిలాల్పూర్ గ్రామానికి చెందిన శకుంతలమ్మకు రూ.42,000, బాలరాజుకు రూ.60,000, సురేశ్కుమార్కు రూ.51,000, తిరుమలయ్యకు రూ.52,000, శివప్పకు రూ.12,000ల చెక్కును అందజేశారు. అదేవిధంగా కోయిల్ కొండ మండలం మ ల్కాపూర్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డికి మంజూరైన రూ.లక్ష ఎల్వోసీ పత్రాన్ని లబ్ధిదారుడికి అందజేశారు.
ప్రమాద బీమా చెక్కు అందజేత
మండలంలోని జాజాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నరసింహ ఇటీవల మృతి చెందాడు. ఆయన కు పార్టీ సభ్యత్వం ఉండడంతో ప్రమాద బీమా మంజూరైం ది. ఎమ్మెల్యే జాజాపూర్లోని నామినీ రేణుక ఇంటికి వెళ్లి ప్రమాద బీమా చెక్కును అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, సీనియర్ నాయకులు చంద్రకాం త్, ప్రతాప్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.