మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 25 : కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. వంద రోజుల్లోనే వారి పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గురువారం మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజ య్య యాదవ్, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. మీడియాతో మాట్లాడిన అనంతరం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు.
సాగునీరు లేక పంటలు ఎండి రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయారన్నారు. కాంగ్రెస్ హయాంలో మహిళలు నీళ్ల కోసం బిందెలతో బయటికొచ్చే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నాటి నుంచి మహిళలు చేయి ఎత్తితే బస్సులు నిలిపే పరిస్థితి పోయిందన్నారు. గ్రామాలు, పట్టణ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై అసత్య ప్రచారాలు చేశాయని ఆరోపించా రు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికుడైన మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపిస్తే మ హబూబ్నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నా రు. కరెంట్ కోతలతో పరిశ్రమలు మాతపడే పరిస్థితికి వ చ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు రాష్ర్టానికి రావాల్సిన వాటాను పోరాడి తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలు అ మలుకావని ప్రజలకు అర్థమైందని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గ్యారెంటీలపై మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం పదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రె స్, బీజేపీ పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
కేసీఆర్ తెలంగాణ తీసుకురావడంతోపాటు రాష్ర్టాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోరపాట్లను సరి చేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ప దేళ్ల పాలన ఎట్లా ఉండే.. వంద రోజుల కాంగ్రెస్ పాలన ఎ ట్లుందో ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల కు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్, జెడ్పీ వైస్చైర్మన్ కోడ్గల్ యాదయ్య, రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, కొరమోని వెంకటయ్య, రెహమాన్ పాల్గొన్నారు.