నారాయణపేట, జూన్ 24 : పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాము, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం వెంటనే స్పందించి పెరుగుతున్న ధరలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం, న్యూడెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెంచిన ధరలను తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సలీం, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ విమర్శించారు. పెంచిన ధరలకు నిరసనగా గురువారం మండలంలోని పెట్రోల్ బంకుల ఎదుట నిరసన చేపట్టారు.అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నబాలు, కృష్ణబాబు, నర్సింహులు, యూసుఫ్, రాజు పాల్గొన్నారు.