ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
భూత్పూర్, జూన్ 16 : రాష్ట్రంలో రైతుల కష్టాలు సీఎం కేసీఆర్ వల్లే తొలిగాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం అన్నాసాగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి అని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఎకరాకూ ఏడాదికి రూ.10 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరులో వరిని క్వింటాకు రూ.1300లకు కొనుగోలు చేస్తుంటే మన మక్తల్లో మాత్రం రూ.1700కు కొంటున్నట్లు తెలిపారు. గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు రైతులకు మాత్రం మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.