మరికల్, జూన్ 5 : వానకాలం ప్రారంభం కావడంతో మండలానికి కావలసిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ శాఖ ఆధికారి జాన్ సుధాకార్ అన్నారు. శనివారం మండలంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శివకుమార్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
మరికల్, జూన్ 5 : రైతుల నుంచి మిల్లర్లు త్వరితగతిన వడ్లను కొనుగోలు చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారి రఘునందన్ అన్నారు. శనివారం మండలంలోని తీలేరు వద్దగల రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేసి మిల్లర్లకు ప్రభుత్వం విధించిన లక్ష్యం మేరకు బియ్యాన్ని సరఫరా చేయాలని సూచించారు. రైతులు వడ్లను సురక్షితంగా నిల్వ చేసుకోవాలన్నారు.