Yadagirigutta | యాదగిరిగుట్ట, మార్చి3: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ ఆలయాలను ప్రధానార్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు.
మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారి సుప్రభాత సేవ, తిరువాధన, భాలభోగం, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకం చేపట్టి స్వామి, అమ్మవార్ల ఉభయ దర్శనాలకు అనుమతినిచ్చారు. ఉదయం 7 గంటలకు స్వామి వారి ప్రధానాలయానికి ద్వారా బంధనం గావించి, మూసి వేశారు. రేపు ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించి స్వామి వారి నిత్య కైంకర్యాలు, ఉభయ దర్శనాలను కొనసాగిస్తామని ఆలయ ప్రధానఅర్చకులు భట్టర్ సురేంద్రాచార్యులు తెలిపారు.