యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేలా స్వామి వారి ఆలయం పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండ చుట్టూ నిర్మితమైన విశాల రహదారుల మధ్య ఆహ్లాదరకమైన చెట్లు, మొక్కల నాటుతున్నారు. వివిధ రకాల ఔషద, పండ్లు, పూల మొక్కలతో పాటు, ఆహ్లాదాన్ని పంచే వివిధ రకాల జాతి మొక్కల పెంపకం చేపట్టారు.
వైకుంఠ ద్వారం నుంచి గండి చెరువుకు వెళ్లే రహదారి మధ్యలో నాటిన ఫీనిక్స్ ఫామ్ జాతికి చెందిన ఈత చెట్లు ఆకట్టు కునేలా ఉన్నాయి. స్వామివారి పాదాల నుంచి గండి చెరువు వరకు మొత్తం మొత్తం 120 చెట్లను నాటనున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. వీటితో పాటు గండి చెరువు చుట్టూ చక్కటి అందాన్ని, ఆహ్లాదాన్ని పంచే వివిధ రకాల జాతి చెట్లను నాటనున్నామన్నారు.