సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్7: ఒకప్పుడు గుడిమల్కాపురం గ్రామ పంచాయతీకి ఆవాస గ్రామంగా ఉండి అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది కోతులాపురం. రాష్ట్ర ప్రభుత్వం 2018లో కోతులాపురాన్ని కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని పక్కగా అమలు చేస్తూ గ్రామస్తుల సహకారంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది కోతులాపురం గ్రామం. సకల సౌకర్యాలతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, ప్రకృతివనం, నర్సరీలో పదివేల మొక్కలు పెంచుతున్నారు. నేరాల నియంత్రణకు గ్రామస్తులందరూ చందాలు వేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పంచాయతీ ట్రాక్టర్తో చెత్తను సేకరిస్తుండటంతో పరిసరాలు శుభ్రంగా కనువిందు చేస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి చిట్టడివిని తలపిస్తూ గ్రామం మొత్తం పచ్చదనం పరుచుకుంది. ఇం టింటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తుండడంతో గుక్కెడు నీళ్ల కోసం బావుల వెంట, బజార్ కుళాయిలు, చేతిపంపుల వ ద్ద గంటల తరబడి నిలబడే పరిస్థితి తీరింది. ఇరువై ఏండ్ల నీటి సమస్య తీరిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. మిషన్భగీరథ పథకంలో భాగంగా గ్రామంలో 60 వే ల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ను నిర్మించారు.
పరుచుకున్న పచ్చదనం
హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపు లా, వీధుల వెంట, ఇండ్ల ముందు, ప్రకృతివనంలో 10 వేల మొక్కలను నాటారు. వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేసి ప్రతిరోజూ నీళ్లను పోస్తూ ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి సంరక్షిస్తున్నారు. ప్రకృతివనంలోని మొక్కలు, గ్రామవీధుల్లో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరగడంతో గ్రామం మొత్తం పచ్చదనం పరుచుకుంది.
అభివృద్ధి ఇలా..
కొత్తగా ఏర్పడిన కోతులాపురం అభివృద్ధికి గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు, సర్పంచ్ విశేషంగా కృషి చేస్తున్నారు. వైకుంఠధామాన్ని రూ.12లక్షల60వేలతో నిర్మించారు. డంపింగ్యార్డును రూ.2లక్షల50వేలతో పూర్తిచేసి సేం ద్రియ ఎరువులను తయారుచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న మురుగు నీటి సమస్యను రూ.6లక్షలతో పరిష్కరించుకున్నారు. ప్రకృతివనంలో 1800 మొక్కలు నాటగా నేడు ఏపుగా పెరిగి చిట్టడివిని తలపిస్తున్నది. పంచాయతీ నిధుల నుంచి రూ.10 వేలతో తడి, పొడి చెత్త బుట్టలను కొనుగోలు చేసి ఇంటింటికీ రెండు బుట్టలను పంపిణీ చేశా రు. అదేవిధంగా రూ.7లక్షల 70వేలతో ట్రాక్టర్ కొనుగోలు చేసి చెత్తను సేకరిస్తుండటంతో గ్రామంలోని వీధులు శుభ్రంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీకి వచ్చిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ అందరి సహకారంతో సర్పంచ్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
నిఘా నీడలో గ్రామం..
గ్రామంలో నేరాల నియంత్రణకు గ్రామస్తులు చందాలు వేసుకుని రూ 2లక్షల10వేలతో అత్యాధునిక ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామం మొ త్తం నిఘా నీడలోకి వెళ్లింది. 30 ఎల్ఈడీ లైట్లను ఏర్పా టు చేయడంతో విద్యుత్ కాంతులతో గ్రామం మెరిసిపోతున్నది. పాఠశాలలో స్టేజీ నిర్మాణానికి, కోతుల బెడద నివారణకు, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1లక్ష వరకు సర్పంచ్ సొంత నిధులు ఖర్చు పెట్టి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు.
ఇవీ కూడా చదవండీ…
MI ఫ్యాన్ ఫెస్టివల్..స్మార్ట్ఫోన్లు, టీవీలపై ఆఫర్లు
కన్నుమూసి తెరిచేలోపు డ్రస్ మార్చేసిన మోడల్.. వీడియో
కొవిడ్ తదుపరి పరిణామాలు భయంకరమైనవి : డబ్ల్యూహెచ్ఓ
చెడ్డీలోనే పెండ్లికొడుకు..షాకైన జనం