సెయింట్ లూయిస్ (యూఎస్ఏ) : అమెరికాలో జరుగుతున్న సింక్ఫీల్డ్ కప్లో భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు తొలి ఓటమి ఎదురైంది. తొలి గేమ్ను డ్రా చేసుకుని రెండో పోరులో గెలిచిన అతడు.. గురువారం జరిగిన మూడో రౌండ్లో జర్మనీ జీఎం విన్సెంట్ కీమర్ చేతిలో ఓడిపోయాడు.
51 ఎత్తుల్లో ముగిసిన గేమ్లో ఓడిన ప్రజ్ఞానంద.. మూడు రౌండ్లు ముగిసేసరికి 1.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయాడు. అమెరికా జీఎం వెస్లీ (2.5 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.