రాజాపేట: చారిత్రాత్మకమైన దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ యాద్రాది జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని వాసాలమర్రిలో అమలు చేయడం హర్షణీయమని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని రఘునాథపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
దళితబంధు పథకం ప్రవేశపెట్టడంతో దళిత సమాజం సీఎం కేసీఆర్ వెన్నెంటే ఉంటారన్నారు. హామీ మేరకు వాసాలమర్రిలో 24 గంటల్లో దళితబంధు కోసం నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాన్ని దళితులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో మండల టీఆర్ఎస్ కార్యదర్శి సందిల భాస్కర్గౌడ్, యవజన ప్రధాన కార్యదర్శి పల్లె సంతోశ్గౌడ్, శివ, నవీన్, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.