భూదాన్పోచంపల్లి: పేదలకు అండగా ఉండేది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండ లంలోని దంతూరు గ్రామ సర్పంచ్ దోటి కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తోందని, అందుకే టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్శి తులు అవుతున్నారన్నారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో గ్రామ ఉప సర్పంచ్ బోదాసు నర్సింహ, శంకరయ్య, సత్తయ్యతోపాటు సుమారు 150 మంది ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్య క్షుడు పాటి సుధాకర్రెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి, టీఆర్ఎస్ నాయకులు బత్తుల శ్రీశైలం, గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్, కంబాలపల్లి సత్తయ్య పాల్గొన్నారు.