ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరి గుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. యాదగిరిగుట్టకు ఇప్పటికే 100 పడకల ఆస్పత్రి మంజూరైన నేపథ్యంలో వాటితోపాటే వైద్య కళాశాల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి రోజుకు సుమారు 20 వేల నుంచి 30 వేలు, శని, ఆదివారాల్లో 50 వేలకుపైగా భక్తులు వస్తున్నారని, వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే భక్తులతో పాటు పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీనికి మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ విప్ వెల్లడించారు.
– యాదగిరిగుట్ట, జూన్ 23