యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 23 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గురువారం తెల్లవారుజామునే 5 గంటలకు గిరి ప్రదక్షిణలో పాల్గొని పాదయాత్రగా కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్ధి, యువజన విభాగం నాయకులు, నార్మూల్ డైరక్టర్లు, పాల సంఘం చైర్మన్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, బీఆర్ఎస్ బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, మాజీ కౌన్సిలర్ బూడిద సురేందర్, కర్రె శేఖర్, మాజీ బీర్ల చంద్రయ్య పాల్గొన్నారు.