యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఎదుర్లగూడెం, టేకుల సోమారం గ్రామాల మధ్య భువనగిరి- చిట్యాల ప్రధాన రహదారిపై రైతుల ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు.