యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 29 : భువనగిరి పట్టణంలో దొంగ నోట్లు వెలుగు చూశాయి. పల్లెర్ల నాగేంద్రబాబు కిలానగర్లో మొబైల్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 11:30 గంటలకు అతడి వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన వద్ద రూ.11 వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని రిక్వెస్ట్ చేయగా నాగేంద్రబాబు తన ఫోన్ పే ద్వారా అతడు చెప్పిన నెంబర్కు ఫోన్ పే చేసి నగదు తీసుకున్నాడు. ఆ తర్వాత చెక్ చేయగా అవి నకిలీవని తేలింది. దీంతో తాను మోసపోయానని గుర్తెరిగి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.