అర్వపల్లి, ఆగస్టు 06 : ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా స్వీకరించి సంరక్షించాలని అర్వపల్లి ఎంపీడీఓ ఝాన్సీ, తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. గురువారం మండలంలోని రామన్నగూడెంలో గ్రామ సర్పంచ్ కర్నాటి వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో వారు పాల్గొని మొక్కలు నాటారు. ఎక్కడా లేని విధంగా గ్రామ సర్పంచ్ నర్సరీలో 6 రకాల పండ్ల మొక్కలను పెంచడం అభినందనీయమన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, మొయిన్ రోడ్డు వెంబడి మొక్కలు నాటారు. నర్సరీలో పండ్ల మొక్కలు పెంచి నాటడానికి సిద్దం చేసిన వన సేవకురాలు సుజాతను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉప సర్పంచ్ లింగంపల్లి రవిందర్, అంగన్వాడీ టీచర్ పుష్పలత, ఏఎన్ఎం గిరిజ, వార్డు సభ్యులు మాగి మీనాక్షి, తవిటి సైదులు, శారద నాగరాజు, ముఢావత్ తనేష్, స్రవంతి పాల్గొన్నారు.