యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ క్రమంలో ఆయన వెన్నుపూసకు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతున్న నర్సయ్య శుక్రవారం రాత్రి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.