గుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన పసునూరి మహేష్ ఫిట్స్ వ్యాధిలో బాధపడుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో శుక్రవారం అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రూ. 1 లక్ష 50 వేల విలువైన ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నాయకులు పంగ జనార్ధన్రెడ్డి, ఏలూరి నర్సిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు అట్ల రంజిత్రెడ్డి తదితరులు ఉన్నారు.