భువనగిరి అర్బన్: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.95లక్షలతో, 35వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.90 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులలో గుర్తించిన పనులను దశలవారీగా పూర్తి చేస్తానన్నారు.
పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, వాటితో వార్డుల్లో ఉన్న సమస్యలు పరిష్కారమైనట్లు చెప్పారు. కార్యక్రమం లో 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి, 35వ వార్డు తంగళ్లపల్లి శ్రీవాణి, 17వ వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు డీఈ శ్రీనివాస్, ఏఈ మూర్తి, నాయకులు అనిల్, కిరణ్, నరేశ్, లలిత పాల్గొన్నారు.