వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు పైళ్ల ఫౌండేషన్ సౌజన్యంతో నూతన వధూవరులకు పట్టు వస్ర్తాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లిని ఆర్థిక భారమని తల్లిదండ్రులు బావించోద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి గొప్పగా అమలు చేస్తున్నారన్నారు.
అనంతరం మండలంలోని అరూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఎమ్మెల్యే సొంత నిధులతో మండలానికి సమకూర్చిన అంబులెన్స్ నిర్వహణ ఖర్చులకు రూ.3లక్షల చెక్కును ఎంపీడీవో గీతారెడ్డికి అందజేశారు. వలిగొండ లింగరాజుపల్లి గ్రామాల మధ్య కూలిన కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మారగోని జంగాల్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిగా అతని కుటుంబాన్ని పరామర్శించి కూతుర్ల చదువుకు అయ్యే ఖర్చులు భరించనున్నట్లు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్రాజ్, జడ్పీటీసీ వాకిటి పద్మ అనంత రెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, మత్స్యగిరి దేవస్థానం చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ కునపూరి కవిత, సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, ఎంపీటీసీలు పల్సం రమేష్, తహసీల్దార్ నాగలక్ష్మీ వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.