నల్లగొండ: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ బస్సులో (సీజీ 17 కేఎస్ 9295) ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. మొత్తం 23 ప్యాకెట్లలో 69 కేజీల గంజాయి ఉన్నదని, బస్సును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.