హాలియా: పేద విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియాలో బీసీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటైన విద్య నందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజికవర్గాల వారీగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిందన్నారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తు న్నదన్నారు. గురుకుల ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసిన తరువాత ఇటీవల రాష్ట్రంలో ఏ యూనివర్సీటీ పలితాల్లో చూసినా ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే స్టేట్ ర్యాంకులు సాధిస్తున్నారని తెలి పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య, భోజనం లభిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాల, హస్టల్స్లో చదవుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు.
గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 గురుకుల పాఠశాలలు ఉంటే నేడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 28 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే సంకల్పంతో 14 గురుకుల పాఠశాలల్లో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గురుకుల పాఠ శాలను ఆ ప్రాంతంలోనే నిర్వహించడం వలన పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి అవకాశం లభిస్తుంద న్నారు.
బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవన నిర్మాణ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బీసీ గురుకుల పాఠశా లకు సొంత భవనం నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్ర మంలో ఆర్సీవో షకీనా, ఎంఈవో బాలునాయ క్, ప్రిన్సిపాల్ సంధ్య, టీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గౌరవ సలహదారుడు వెంపటి శంకర య్య, వర్రా వెంకట్రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్ నాయక్, చెన్ను డోమినిక్ టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లి అభినయ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.