కల్వకుర్తి: సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 17మంది లబ్ధిదారుల కు కల్యాణలక్ష్మి చెక్కులు, స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు డిక్షనరీలు, కల్వకుర్తి మండలానికి చెందిన ముగ్గురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు విజయ్గౌడ్, జాగృతి గణేశ్, ఈశ్వరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్, కౌన్సిలర్లు సూర్యప్రకాశ్, మనోహర్రెడ్డి, తాసీల్దార్ రాంరెడ్డి వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.