నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సిద్దిఖీ (57) గుండెపోటుతో మృతి చెందారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఈ ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. సిబ్బంది చికిత్స నిమిత్తం హుటాహుటిన అతడిని నాగర్ కర్నూల్ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్దిఖీ స్వస్థలం వనపర్తి జిల్లా పానుగల్ గ్రామం. సిద్దిఖీ మృతి పట్ల స్థానిక పోలీసు సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.