గోవిందరావుపేట : పర్యాటక ప్రాంతమైన మండలంలోని లక్నవరంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. సెలువు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా లక్నవరానికి చేరుకున్నారు. వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకుని సరస్సులో కాయకింగ్, స్పీడ్, పెద్ద బోటులో ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. చిన్నారులు బ్యాటరీ కార్లతో ఆటలాడారు.
యువతీ, యువకులు సరస్సుపై ఏర్పాటు చేసిన జింప్సైక్లింగ్పై ప్రయాణించి మంత్రమగ్దులయ్యారు. అనంతరం రెస్టారెంట్లో విడిది చేసి రుచులకు ఫిదా అయ్యారు. పర్యాటకుల రాకతో లక్నవరం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.