ఉప్పల్ : చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ గురువారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతంలో ఎమ్మెల్సీ కవితను కలిసి ఈ మేరకు పండ్ల బొకేను అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీపడవద్దని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలకు అందేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకానగర్ డివిజన్ టీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నేతలు పల్లె నర్సింగ్రావు, ఏదుల కొండల్రెడ్డి, శేఖర్, జగన్, ఇర్షాద్బాయ్, వీబీ.నర్సింహా, శ్రీనివాస్, సరిత, శ్రీనివాస్, రామాంజనేయులు, శ్రీకాంత్, సూర్య పాల్గొన్నారు.