బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో బోనీ కపూర్ ఒకరు. మంచి కథాంశం ఉన్న చిత్రాలని నిర్మిస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉండే బోనీ కపూర్ ఇటీవల వకీల్ సాబ్తో మంచి లాభాలు అందుకున్నారు. హిందీ, తమిళంలో పింక్ చిత్రాన్ని నిర్మించినప్పటికీ తెలుగులో మాత్రం సమర్పకుడిగానే ఉన్నారు .అయినప్పటికి భారీగానే లాభాలు రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా మైదాన్ అనే చిత్రం నిర్మిస్తున్నారు బోనీ కపూర్. ఈ సినిమా కోసం ఇటీవల ముంబైలో భారీ సెట్ వేశారు.
ఈ సెట్ మొత్తం తౌటే తుపాను ధాటికి ధ్వంసం అయింది. తుపాను కారణంగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్ మీడియాకు వెల్లడించారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్ని తొలిసారి కూలగొట్టాం. మళ్లీ సెట్ వేసి చిత్రీకరించాం. లాక్డౌన్ తర్వాత మరోసెట్ నిర్మించాం. అది తౌటే తుపాన్ దాటికి ధ్వంసమైంది. దాదాపు 30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని బోనీ కపూర్ అంటున్నారు.