Lok Sabha Elections | బన్స్వారా, ఏప్రిల్ 24: రాజస్థాన్లోని బన్స్వారా-దుంగార్పూర్ ఎస్టీ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల పోరు విచిత్రంగా మారింది. గిరిజనులు అధికంగా నివసించే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండటమే ఈ విచిత్ర పరిస్థితికి కారణం. వివరాల్లోకెళ్తే.. ఆ నియోజకవర్గానికి కాంగ్రెస్ తొలుత తమ అభ్యర్థిగా అర్వింద్ దమోర్ పేరును ప్రకటించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
కానీ, ఆ తర్వాత భారత్ ఆదివాసీ పార్టీతో కాంగ్రెస్కు పొత్తు కుదరడంతో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రాజ్కుమార్ రోత్ను బరిలోకి దింపాయి. కానీ, అప్పటికే వేసిన నామినేషన్ను ఉపసంహరించుకునేందుకు దమోర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో దమోర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ ఓట్లను దమోర్ చీల్చే అవకాశం ఉండటంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేంద్రసింగ్ మాలవీయకు లబ్ధి చేకూరడం ఖాయమని స్పష్టమవుతున్నది.