చేర్యాల, జూన్ 5 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన యేశబోయిన స్వరూప సంజీవులు దంపతుల ఏకైక కుమారుడు సాయికుమార్(22) అనే యువకుడు కరెంటు షాక్గురై మృతి చెందాడు.
శనివారం రాత్రి సాయికుమార్ ఇంట్లో లైట్లు వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ రావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సాయికుమార్కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేర్యాల దవాఖానకు తరలిస్తున్న క్రమంలో మార్గమద్యలో మృతి చెందినట్లు తెలిపారు.
ఇటీవలే సాయికుమార్ సొదరి భర్త గుండెపోటుతో మరణించాడు. నేడు కరెంటు షాక్కు గురై కుమారుడు మృతి చెందడంతో సంజీవులు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా మృతుడి కుటుంబాన్ని వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డి తదితరులు పరామర్శించి సంతాపం తెలిపారు.