Womens Safety | రాయపోల్, మార్చి 9 : మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని రాయపోల్ ఎస్సై రఘుపతి అన్నారు. ర్యాగింగ్ విజిటింగ్, డ్రగ్స్, ముత్తు పదార్థాలకు విద్యార్థిని విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు.
డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు.
కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు, కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. భారతదేశంలో నూతన చట్టాలు జూలై 1 నుండి అమలు చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ నూతన చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు నూతన చట్టాలలో నేరం చేసిన నేరస్తులకు కఠినమైన శిక్షలు అమలు చేయడం జరుగుతుందన్నారు.
బాధితులకు అండగా చట్టాలు ..
చట్టాలు బాధితులకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు ఎవరితోనైనా ఎవరైనా హేళనగా మాట్లాడినా మౌనం వీడి తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ చెప్పుకోవాలని సూచించారు.. లేని పక్షంలో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.
మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. పిల్లలు మహిళలు ఏమైనా సమస్యలు ఇంట్లో కానీ బయట కానీ ఎదుర్కొంటే వెంటనే షీటీమ్ వాట్సప్ నెంబర్ 8712667343 మహిళా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712667435, సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుగంధాలత, మరియు ఉపాధ్యాయులు, గజ్వేల్ షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు, మహిళ కానిస్టేబుల్ లావణ్య, కానిస్టేబుల్ మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also :
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేదన
Bomb Attack | పాఠశాలపై బాంబులతో దాడి.. షాకింగ్ వీడియో
Chhaava Movie | నాలుగు రోజుల్లో రూ.10 కోట్లు.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ విధ్వంసం