నారాయణరావుపేట, అక్టోబర్ 18 : నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సిద్దిపేట రూరల్ ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట జడ్పీహెచ్ పాఠశాలలో దసరా సెలవుల్లో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఫర్నిఛర్, స్విచ్ బోర్డును ధ్వంసం చేశారు.
ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాలను పరిశీలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.