సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.శుక్రవారం పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్నదని, ఫ్రంట్ వారియర్స్గా విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోస్ల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మాస్క్లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
జాగ్రత్తలు పాటించాలి
వ్యాక్సిన్ వేయించున్న కరోనా రాదని, మాకేం కాదని నిర్లక్ష్యాన్ని వీడాలని అందరి మాదిరిగానే జాగ్రత్తలు పాటించాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. పోలీసు అధికారులు జిల్లా యూనిట్ స్థాయిలో అనునిత్యం కరోనా కట్టడికి పర్యవేక్షణ జరుపాలని సూచించారు. గ్రామాల్లోని వివిధ సంఘాలతో, పెద్దలతో వీఆర్ఏ, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లతో కమిటీ ఏర్పాటు చేసి కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాన్ఫరెన్స్లో అడిషినల్ డీసీపీ శ్రీనివాసులు, ఏసీపీ రామేశ్వర్, సీఐ నర్సింహారెడ్డి, ఎస్సైలు సర్దార్జమాల్, మహిపాల్రెడ్డి, రాజ్కుమార్, అభిలాష్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
రైలు సర్వీసులు తగ్గించం.. రైల్వే బోర్డు