సంగారెడ్డి, ఏప్రిల్ 9 : పరిశ్రమలు, వివిధ కర్మగారాల్లో పనిచేస్తున్న 45 ఏండ్లు దాటిన వారికి పని చేసే చోటనే కొవిడ్ వ్యాక్సిన్ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పరిశ్రమల్లో పనిచేసే వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. మెడికల్ ఫెసిలిటీ, డిస్పెన్సరీ డాక్టర్, అవసరమైన నాలుగు గదులు ఏర్పాటు చేస్తే వ్యాక్సినేషన్ వేయడానికి శిక్షణ ఇచ్చి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారని, ప్రైవేట్ ఆర్గనైజేషన్తో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ఒక్కో డోస్కు రూ. 250 చెల్లించాల్సి ఉం టుందన్నారు.
ఇందుకోసం జిల్లా లో 8 ప్రైవేట్ దవాఖానల్లో వ్యాక్సి న్ ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమ ఉద్యోగులు కాని వారికి, వారి కుటుంబ సభ్యులకు వేయరన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపడుతున్నామని, ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ పని చేస్తారన్నారు. ఆయా పరిశ్రమల్లో అందరు పూర్తయ్యే వరకు వ్యాక్సిన్ కొనసాగుతుందన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన వారి వివరాలతో, వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధ్దం కావాలని కోరారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి డీఎంఅండ్హెచ్వో గాయత్రీదేవి, జిల్లా పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
అగ్గికురిసే ఎండలో.. గోదారమ్మ జలసవ్వడి