జహీరాబాద్, ఏప్రిల్ 9 : వేసవిలో తాగునీటి సమస్య రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్లు అడిషనల్ కలెక్టర్ రాజర్షి షాను కోరారు. శుక్రవారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలైన రంజోల్, పస్తాపూర్ గ్రామంలో పర్యటించారు. తాగునీటి సమస్యతో పాటు అభివృద్ధి పనులు పరిశీలించారు. రంజోల్ గ్రామంలోని శివాజీ నగర్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వారికి తెలిపారు. ట్యాంకర్లతో నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసి మంజీరా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పస్తాపూర్ గ్రామం లో రూ.కోటితో వైకుంఠధామం నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పస్తాపూర్లో నిర్మా ణం చేసే వైకుంఠధామం ఆదర్శంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్బాబు, మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు, మున్సిపల్ డీఈఈ దీప్చంద్ పాల్గొన్నారు.
84 మందికి చెక్కులు..
ఆడ్డ పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో మొగుడంపల్లి మండలానికి చెందిన 84 మంది లబ్ధ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో కల్యాణలక్ష్మి పథకం లేదన్నారు. ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధ్దిదారులకు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడానికి మంజీరా నదిపై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మొగుడంపల్లి తహసీల్దార్ ప్రేంకుమార్, పీఏసీఎస్ చైర్మన్ కిషన్ పవార్, టీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి, సంజీవ్రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇంటికి పెద్దన్నలా సీఎం కేసీఆర్
పెళ్లి కూతురుకు పెళ్లి కానుకగా, ఇంటికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్లను అందిస్తున్నారని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. కల్హేర్ గ్రామానికి చెందిన ముగ్గురికి, బాచేపల్లి గ్రామానికి చెందిన ఒకరికి షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ జైరాం, బాచేపల్లి పీఏసీఎస్ చైర్మన్ సంగారెడ్డి, ఎంపీటీసీ సంగప్ప ఉన్నారు.
సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చాప్టా(కె) గ్రామంలోని హనుమాన్ మందీర్లో వారం రోజులుగా నిర్వహిస్తున్న సప్తాహ ముంగింపు సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కొద్దిసేపు భజన చేశారు. అంతకు ముందు ఆలయంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ పార్శెట్టి సంగమ్మ సంగప్ప ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సత్కరించారు. ఎమ్మెల్యే వెంట బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా+పెట్రో రేట్లు.. టూ వీలర్స్ సేల్స్ డౌన్..