న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో రైలు సర్వీసులను నిలిపివేయడం గానీ, తగ్గించడం గానీ చేయబోమని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. కరోనా రెండో వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు సొంత రాష్ట్రాలకు బయలు దేరి వెళుతున్నారు.
డిమాండ్కు అనుగుణంగా రైలు సర్వీసులను పెంచుతామని భారతీ రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. ప్రస్తుతం రైలు సర్వీసులకు సాధారణంగానే డిమాండ్ ఉంటుందని, ప్రయాణికుల విజ్ఞప్తులకు అనుగుణంగా సర్వీసులు పెంచుతామన్నారు.
పలువురు ప్రయాణికులు మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ విధిస్తారన్న భయంతోనే తాము సొంత రాష్ట్రాలకు వెళుతున్నామని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్గా రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది.
అయితే, రైలు ప్రయాణానికి ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని సునీత్ శర్మ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం రైలు సర్వీసులను నిలిపివేసినట్లుగానీ, తగ్గించినట్లు గానీ తమకు సమాచారం లేదన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
తక్కువ సిబిల్ స్కోర్తోనూ పర్సనల్ లోన్.. అయితే!