ఓవైపు ఎండలు మరోవైపు కరోనా. గతేడాది లాగానే ఈ ఏడాది కూడా ప్రజలను ఈ రెండు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఏం తిన్నాలన్నా భయమే. వేడి చేస్తుందేమోనని భయం. అసలు ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలని..వేటికి దూరంగా ఉండాలని చాలామందికి అనుమానాలున్నాయి.
వైద్యుల సలహా ప్రకారం చలువ చేసే, త్వరగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు ఈ కరోనా టైమ్ లో సీ విటమిన్, డ్రైఫ్రూట్స్ తో పాటు ఆకుకూరలు, కూరగాయాలనే ఎక్కువగా తీసుకోవడం మంచిందంటున్నారు. ఇప్పుడున్న ఈ ఎండల్లో మాంసం, రెడ్ మీట్ కి దూరంగా ఉండటం చాలామంచిదంటున్నారు. మసలా, ఎక్కువ స్పైసీగా ఉండే ఆహారం తీసుకోకపోవడమే బెటరని సూచిస్తున్నారు.
అలాగే ఇది మామిడిపండ్ల సీజన్. కాబట్టి పిల్లలతో పాటు పెద్దవాళ్లవరకు అందరూ మామిడి పండ్లని తినడానికి ఆసక్తిచూపిస్తారు. అయితే పరిమితంగా తినమని సలహా ఇస్తున్నారు డైటీషియన్లు. ఇప్పుడు చెప్పుకున్న రెడ్ మీట్, మాంసం, మామిడిపండ్లు విపరీతమైన వేడిని కలుగజేస్తాయి. తద్వార జీర్ణప్రక్రియ సరిగ్గా ఉండక ఉదర సంబంధ వ్యాధులు వస్తాయంటున్నారు.
ఫ్రిడ్జిలోని నీరు తాగేకన్నా కుండల్లో నీటిని తాగడం మంచిదంటున్నారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లు వంటివి పిల్లలకు కూడా దూరంగా ఉంచడం చాలాచాలామంచిదంటున్నారు. కరోనా టైమ్ లో ఈ చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదంటున్నారు. నిమ్మరసం, కొబ్బరినీళ్లు, పసుపు వేసిన పాలు, మజ్జిగ లాంటివి తీసుకోవడం ఉత్తమని ఆరోగ్యనిపుణులు సలహా ఇస్తున్నారు.