సిద్దిపేట: జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సిద్దిపేట పోలీసు కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ఈనెల 20న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలు సూచనలిచ్చారు.
ఆధునిక హంగులతో రూ.81కోట్ల వ్యయంతో జిల్లా కార్యాలయాల సమీకృత భవన సముదాయం, పోలీస్ కమిషనరేట్ భవనాలు నిర్మించారు. సిద్దిపేట శివారులో 29 ఎకరాల విస్తీర్ణంలో జీ+2 విధానంలో పోలీస్ కమిషనరేట్ ఇప్పటికే సిద్ధమైంది. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సిద్దిపేట హౌసింగ్ బోర్డులో కొత్తగా నిర్మించిన విషయం తెలిసిందే.