దుబ్బాక టౌన్, మే 4 : పిడుగుపాటుతో రైతు మృతి చెందగా మరో రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంనర్లెంగగడ్డలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి దుబ్బాక ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నర్లెంగగడ్డలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబెట్టుకొన్న సమయంలో బుధవారం తెల్లవారుజామున పిడుగులతో కూడిన భారీ వర్షం కురువడంతో.. ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుతున్న రైతులపై పిడుగుపడటంతో రైతు సౌడు పోచయ్య (65) అక్కడిక్కడే మృతి చెందాడు.
మరో రైతు రెడ్డబోయిన కొండయ్య తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటుతో రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోచయ్య మృతదేహాన్ని పోస్టుమార్టుమ్ నిమిత్తం దుబ్బాక ఏరియా దవాఖానకు తరలించారు.