గజ్వేల్ రూరల్, ఏప్రిల్17 : కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుంట బక్కోల్ల అంజిరెడ్డి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. కరెంట్ ఫీజ్ పోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజ్ను సరిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసున్న కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతను మృతిచెంది కనిపించడంతో బోరున విలపించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.