అమరులస్ఫూర్తితో రాష్ట్రం బంగారు తెలంగాణగా అవతరించింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది. దశాబ్ది ఉత్సవాల్లో చివరిరోజైన గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరుల స్తూపం వద్ద నివాళుర్పించి మౌనం పాటించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా రని, తెలంగాణ ఏర్పడిన 9ఏండ్లలో అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించిందన్నారు. అనంతరం 19మంది అమరవీరుల కుటుంబాలను సన్మానించి, సహపంక్తి భోజనం చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్ , జూన్ 22
మిరుదొడ్డి, జూన్ 22 : తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల త్యాగ ఫలితమే తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిందని తెలంగాణ ఉద్యమ పూర్వ పు జేఏసీ చైర్మన్ డాక్టర్ పాప య్య అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా గురువారం కొండాపూర్ గ్రామంలో సర్పంచ్ కవితారాజు ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూప నిర్మాణానికి సహకరించిన గుండం రాజమహేందర్రెడ్డితోపాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఘనం గా సన్మానించారు.
అనంతరం పాపయ్య నాటి ఉద్యమ నాయకుడు, నేటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన మలి దశ తెలంగాణ ఉద్యమం ఒక్క రక్తపు బొట్టు చిందకుండా ప్రజాసామ్య పంథాలో సబ్బండ వర్గాల సహకారంతో తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాకారం చేశారని తెలిపారు. అమరుల త్యాగ ఫలితాలను ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, దుబ్బాక ఆత్మ కమి టీ చైర్మన్ భాస్కరాచారి, జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, టీడబ్ల్యూజే వర్కింగ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రంగాచారి, సీనియర్ జర్నలిస్టు అంజయ్య, ఎంపీడీవో రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ పోలీస్ రాజు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కమలాకర్రెడ్డి, నాయకులు రాజమహేందర్రెడ్డి, సురేందర్, నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ అమర్ పాల్గొన్నారు.