దుబ్బాక : దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు (Mallannasagar project) ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల (Sub-canals) నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి( MLA Kotha Prabhakar Reddy) నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి (Minister Uttam Kumar Reddy) ని కోరారు. మంగళవారం సెక్రటేరియట్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు.
కాళేశ్వరం(Kaleshwaram,) , రంగనాయక సాగర్ (Ranaganayaka Sagar) ల నుంచి దుబ్బాక నియోజకవర్గం రైతులకు సాగునీరందించేందుకు కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. రామయంపేట. చేగుంట, దుబ్బాక మండలాల్లో పలు చోట్ల ఉప కాల్వల నిర్మాణ పనులు నిలిచిపోయాయని వివరించారు.
నియోజకవర్గంలో సుమారు లక్షా 30 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రధాన కాల్వల నుంచి ఉప కాల్వల నిర్మించాల్సి ఉందని వెల్లడించారు. మల్లన్నసాగర్తో అన్ని గ్రామాలకు సాగునీరు సరఫరా చేసి, రైతుల సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.